కామన్ డైట్ మెనూ ప్రారంభించిన ఎస్పీ
NEWS Dec 14,2024 03:18 pm
మెట్పల్లి మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో ఎస్పీ అశోక్ కుమార్ మున్సిపల్ కమిషనర్ మోహన్, ప్రిన్సిపల్ తిరుపతితో కలిసి కామన్ డైట్ మెనూ ప్రారంభించారు. ఎస్పీ, కమిషనర్లకు పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులతో కలిసి వారు భోజనం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డిఎస్పీ రాములు, సీఐ నిరంజన్ రెడ్డి తదితరులున్నారు.