మెట్పల్లిలో రాజ్యాంగ ప్రతిమ, వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
NEWS Dec 14,2024 03:25 pm
సుఖీభవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన రాజ్యాంగ ప్రతిమతోపాటు వాల్ పోస్టర్లను మెట్పల్లి డీఎస్పీ రాములు శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు బొక్కెనపల్లి నాగరాజు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బత్తుల లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ సలహదారుడు జడల ప్రభాకర్, రెవెన్యూ డివిజన్ సాధన కమిటి అధ్యక్షడు నాంపల్లి గట్టయ్య, తరి స్వామి, శంకర్ తదితరులున్నారు.