అటవీ సంపద పెంపు కోసం గత ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లను మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా నాటిన చెట్లను కొందరు భూ యజమానులు వారి భూములకు అడ్డుగా ఉన్న చెట్లను ఇష్టారీతిన నరికివేశారు. గ్రామ ప్రజలు నరికిన చెట్లను చూసి ప్రభుత్వం వేలాది రూపాయలు వెచ్చించి చెట్లను నాటితే ఇష్టానుసారంగా నరికివేయడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.