లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NEWS Dec 14,2024 03:31 pm
మల్యాల మండలంలో శనివారం కాంగ్రెస్ నాయకులు CMRF చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు గాను రూ.5 లక్షల 500 విలువగల CMRF చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్ గౌడ్, శనిగారపు తిరుపతి, వంశీధర్, నక్క అనిల్, బాబు, తదితరులు పాల్గొన్నారు.