బాల్కొండలో TGMDC చైర్మన్ పర్యటన
NEWS Dec 14,2024 08:46 am
బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ జూనియర్ కళాశాల, మోడల్ స్కూలును టీజీఎండీసీ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న భోజనం సరిగా ఉందా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భోజనం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి ఆహారం పెట్టాలని, మెనూ ప్రకారం అందించాలని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు.