నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. మోకాళ్లపై కూర్చొని తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేసారు. ఎన్నికలకు ముందు మేము సమ్మె చేస్తే ప్రతి పార్టీ నాయకులు మాకు మద్దతుగా తెలిపారు. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవని ఏ ఒక్క పార్టీ మా సమ్మెకు మద్దతు తెలుపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చిన హామీ మేరకు వెంటనే తమను రెగ్గులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.