డిసెంబర్ 28న భక్తులతో టీటీడీ ఈవో డయల్ యువర్ ఈఓ అనే గంట సేపు లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ జరగనుందని టీటీడీ తెలిపింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య జరగనుంది. వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు నేరుగా ఈవోతో మాట్లాడే ఛాన్స్ ఇస్తుంది. ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.