ఎమ్మెల్యేను కలిసిన BKS నేతలు
NEWS Dec 14,2024 08:04 am
భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కలిసి తమ సమస్యలపై విన్నవించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి ఎమ్మెల్యేకు మెమోరాండం అందించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబిర్ ఆనంద్ రావు, జోనల్ అధ్యక్షులు లొంక వెంకట్ రెడ్డి BKS ప్రతినిధులు పాల్గొన్నారు.