తిరుమలలో నిండిన జలాశయాలు
NEWS Dec 14,2024 07:00 am
తిరుమలలో కురిసిన వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఆయా జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 355 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి.