తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తికా దీపోత్సవం నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణ-“హర హర మహాదేవ శంభో శంకర” అనే మంత్రోచ్ఛారణల మధ్య “కార్తీక దీపోత్సవం” అత్యంత భక్తి పారవశ్యంతో జరిగింది.. ఆలయ ప్రాంగణంలో మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.