విజయ డెయిరీకి రావాల్సిన పాడి రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కామారెడ్డి డెయిరీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కోరారు. తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఅపరేటివ్ ఫెడరేషన్(టీఎస్డీడీసీఎఫ్) రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. బిల్లులు త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని తిరుపతిరెడ్డి తెలిపారు.