కాంగ్రెస్ మోసాలు చేయడం తగదు
NEWS Dec 14,2024 06:23 am
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా 6 గ్యారెంటీలు అమలు పరడంలో విఫలం అయిందని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. 6 గ్యారెంటీలు 66 మోసాలపై బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారన్నారు. కాంగ్రెస్ వైఫల్యంపై బీజేపీ ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.