కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈనెల 16న చరిత్రాత్మకమైన వన్ నేషన్ వన్ ఎలక్షన్ (ఒకే దేశం ఒకే ఎన్నిక) బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించింది. ముసాయిదా పూర్తయిందని, ఇక బిల్లు ఆమోదం పొందడమే మిగిలి ఉందని పేర్కొంది. అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశ పెడతారని తెలిపింది కేంద్రం.