చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యం
NEWS Dec 14,2024 06:26 am
SRSP పరిధిలోని ప్రతి కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించడమే లక్ష్యమని ఎస్సారెస్పీ ఈఈ నారాయణరెడ్డి అన్నారు. ప్రస్తుతం కాలువల పరిస్థితి.. తీసుకుంటున్న చర్యలు ఆయన వివరించారు. యాసంగి నేపథ్యంలో పంటలకు సాగు నీరందించడం, ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ చేపడుతున్నామన్నారు. కాలువలకు కొన్నిచోట్ల మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.