బాన్సువాడ మండలం మెగులాన్పల్లి తండా జీపీ పరిధిలోని దంకుడుమోరి తండాకు చెందిన సభావత్ ప్రేమ్కుమార్ ఇండియా ఎకానమిక్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించాడు. ఇంటర్ వరకు ఆదిలాబాద్లోని జవహర్ నవోదయ పాఠశాలలో చదివిన ప్రేమ్కుమార్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షలకు తోలి ప్రయత్నంలో సత్తా చాటారు.