మల్యాలలో పండుగ సాయన్నకు నివాళులు
NEWS Dec 10,2024 05:45 pm
మల్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక అంగడి బజార్లో టీం DSM ఆధ్వర్యంలో బహుజన రాజ్య స్వాప్నికుడు పండుగ సాయన్న 134వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చరిత్ర మరిచిపోయినా.. పేద ప్రజలకు దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్ హుడ్ గా సాయన్న సుపరిచితుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో దొంతరవేణి శేఖర్, తిరుపతి, నర్సయ్య, రవి, నారాయణ, అలంకార్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.