మోహన్బాబుపై కేసు పెట్టాలి: TJF
NEWS Dec 10,2024 05:12 pm
మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని TJF అధ్యక్షులు పల్లె రవి కుమార్ డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత పుర స్కారం అందుకున్న మోహన్బాబు మీడియా పై ఇలాంటి భౌతిక దాడి చేయడం హేయమైన చర్య అని, మీడియా ప్రతినిధులకు మోహన్బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని TJF డిమాండ్ చేస్తోందన్నారు.