అమరావతి పనులకు సర్కార్ ఆమోదం
NEWS Dec 10,2024 11:35 am
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. సీఆర్డీయే చేపడుతున్న 20 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ 20 సివిల్ పనులకు రూ.11,467 కోట్ల మేర వ్యయం కానుంది.