పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయ 23వ వార్షికోత్సవం
NEWS Dec 10,2024 12:02 pm
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయ 23వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అనగా లక్ష్మీదేవి పాదుక, తులసి కోట దర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి అన్నదాతలుగా చిలువేరి మారుతి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగింది. అన్నప్రసాద దాతని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ సన్మానించారు.