దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక సూచన చేసింది. ఉచిత రేషన్ కార్డులు కాదని ముందు ఉపాధి కల్పించాలని స్పష్టం చేసింది. రేషన్ కార్డులు ఇచ్చేది రాష్ట్రాలని, ఆ కార్డులపై 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఇచ్చేది కేంద్రమని పేర్కొంది. ఆ ధాన్యానికి రాష్ట్రాలు ఏమైనా చెల్లిస్తున్నాయా అని ప్రశ్నించింది.