తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం
NEWS Dec 10,2024 10:49 am
నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపు రేఖలు మార్చి ప్రతిష్టించినందుకు నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ జడ్పి చైర్మన్ విఠల్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆలిని మార్చిన దుర్మార్గులు ఉంటారు కానీ, తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరని మండి పడ్డారు.