కూటమిలో బీసీలకు ప్రాధాన్యత
NEWS Dec 10,2024 09:20 am
కూటమిలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాజ్యసభ సభ్యులలో మూడింటిలో 2 స్థానాలను బీసీలకు ఇచ్చామన్నారు. 42 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో బీసీలకు పెద్దపీట వేశామని చెప్పారు. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. మోడీ నాయకత్వంలో ఏపీకి అన్ని విధాల సహకారం అందుతోందన్నారు.