అల్ప పీడనం జర భద్రం
NEWS Dec 10,2024 08:54 am
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. బుధవారం తమిళనాడు , శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణకోస్తా, రాయలసీమతో పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.