తిమ్మాపుర్ లో దూడపై చిరుత దాడి
NEWS Dec 09,2024 05:28 pm
ఎల్లారెడ్డి మండలంలో తిమ్మాపూర్ గ్రామంలో చిరుత దాడి కలకలం రేపుతుంది. రైతు చిమ్మ సత్యనారాయణ దూడపై చిరుత దాడి చేసి చంపి వేసిన సంఘటన నెలకొంది.తరచుగా గ్రామంలో చిరుత పులి దాడి చేస్తూ ఆవులను చంపుతూ గాయాలపాలు చేస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నరు. చిరుత పులి సంచారం వల్ల రాత్రి వేళలో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.చిరుతను బంధించి రక్షించాలని గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు.