సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గేయ రచయిత అందెశ్రీని సీఎం సన్మానించారు.