సమాచారహక్కు చట్టంపై అవగాహన సదస్సు
NEWS Dec 09,2024 12:58 pm
మెట్పల్లి అక్షర స్కూల్ ఆవరణంలో ప్రిన్సిపాల్ కొత్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు .ఈ సదస్సులో రాష్ట్ర సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ డైరెక్టర్ M.A సలీం మాట్లాడుతూ.. సమాచార చట్టం వజ్ర ఆయుధం లాంటిదని, విద్యార్థులకు విద్యతో పాటు సమాచార చట్టం అవగాహన ఎంతో అవసరమని, ఈ చట్టం ద్వారా అవినీతి నిర్మూలన చేసి బాధ్యులను శిక్షించగలుగుతామన్నారు. బాలకార్మిక, వరకట్న నిర్ములనపై అవగాహన కల్పించారు.