మల్బరీ సాగు వైపు దృష్టి సారించాలి
NEWS Dec 09,2024 12:55 pm
మల్బరీ సాగు వైపు దృష్టి పెట్టాలని ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో బిక్కనూరు మండలం జంగంపల్లి రైతు వేదికలో సోమవారం కొత్త రైతులకు మల్బరీ, పట్టుపురుగుల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మల్బరీ సాగు చేస్తే 20 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రతినెల లక్ష ఇరవై వేల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు.