అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు రూ. 500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని తాజా మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ తరలి వెళ్తున్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి అసెంబ్లీ సమావేశాల్లో తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని డిమాండ్ చేశారు.