జీవో 46పై సర్కార్ కు కోర్టు నోటీసు
NEWS Dec 09,2024 11:11 am
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవో నెంబర్ 46 బాధితులకు మేలు చేకూర్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, రాకేశ్ రెడ్డి వెల్లడించారు.