ఆశా తల్లులపై దాడులు దారుణం
NEWS Dec 09,2024 10:14 am
పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నామంటూ గొప్పలు చెబుతూ, మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తమని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.