స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
NEWS Dec 09,2024 01:01 pm
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేశారు మిత్రులు. కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్కు చెందిన మేడుదల రాజు గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన చదువుకున్న బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాల పదవ తరగతి (2003-04) బ్యాచ్ విద్యార్థులు ఆదివారం రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని రాజు కుటుంబ సభ్యులకు అందజేశారు.