హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఆకమణల గురించి ఫిర్యాదులు వస్తుండడంతో ప్రతి సోమవారం ప్రజావాణి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు కమిషనర్. హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.