ములుగు జిల్లాలో భూకంపం సంభించింది. తాడ్వాయి మండలం మేడారంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయ భ్రాంతులకు లోనయ్యారు. భయంతో ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. గతంలో ఆగస్టు 31న తాడ్వాయి అడవుల్లో టోర్నడో గాలులు సంభవించి భారీ విధ్వంసం జరగగా అదే క్రమంలో భూకంపం రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనపై అధికారులు లోతైన పరిశీలన చేస్తున్నారు.