పోలీస్ కళాబృందం అవగాహన సదస్సు
NEWS Nov 28,2024 03:21 pm
ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు బొమ్మల మేడిపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం మూఢనమ్మకాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.ఎవరైనా మోసపోయినట్లయితే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.