మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు
NEWS Nov 28,2024 01:57 pm
మహాత్మ జ్యోతిబాపూలే సిద్ధాంతాలను, ఆశయాలను కొనసాగించాలని మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్ అన్నారు. మెట్ పల్లి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబాద్రి, న్యాయవాదులు వెంకట నరసయ్య, రాజ్ మహ్మద్, ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.