రైతులతో మార్కెట్ కమిటీ ఛైర్మన్ భేటీ
NEWS Nov 28,2024 01:58 pm
మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం ప్రజాపాలన ప్రథమ సంవత్సరం సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కూన గోవర్ధన్ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డులో ఈనెల 28, 29, 30వ తేదిల్లో రైతుల పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు ధాన్యం దొడ్డు రకం సుమారు 10,000 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. భవితరాణి, ప్రవీణ్, గంగాధర్ తదితరులున్నారు.