షష్టిపూర్తి సందర్భంగా పుస్తకాల పంపిణీ
NEWS Nov 28,2024 01:56 pm
శాస్త్రి యువజన సంఘం అధ్యక్షులు కోట గంగాధర్ దంపతుల షష్టిపూర్తి మహోత్సవాన్ని పురస్కరించుకొని, సోషల్ యాక్టివిటీస్ లో భాగంగా మెట్ పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ ఐటమ్స్, బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బొమ్మకంటి ప్రమీల, ఉపాధ్యాయులు నాగరాజు, రాజలింగం, శాస్త్రీ సంఘ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ చకినం కేదారినాథ్, తదితరులు పాల్గొన్నారు.