పుప్పాల లింబాద్రికి సన్మానం
NEWS Nov 28,2024 01:52 pm
తెలంగాణ ఫెడరేషన్ న్యాయవాదుల సంఘం అధికార ప్రతినిధిగా మెట్ పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి ఎన్నికైనందుకు మెట్ పల్లి న్యాయవాదుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్ మహమ్మద్ శంకర్ రెడ్డి జిల్లా వెంకటేశ్వర్లు లక్ష్మారెడ్డి లక్ష్మణ్ శ్రీనివాస్, శేఖర్, రామ్ రెడ్డి, నయుం మహేష్, మధుసూదన్, సత్యం, విష్ణు, నరసయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.