ధాన్యం కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Nov 28,2024 01:48 pm
మల్లాపూర్ మండలంలోని ముత్యంపెట్ కుస్తాపూర్ గ్రామంలో గురువారం పాక్స్,ఐకేపీ సెంటర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బి సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని అధికారులకు సూచించారు.