AVBP జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ చౌరస్తాలో వద్ద గురుకుల పాఠశాల విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంవత్సరం గడవకముందే 51 మంది విద్యార్థుల ప్రాణాలు రాష్ట్ర ప్రభుత్వం తీసిందంటూ ఏబీవీపీ జగిత్యాల జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్ మండిపడ్డారు.గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుందో, ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.