ప్రభుత్వ కళాశాలలో ఫుడ్ ఫెస్ట్
NEWS Nov 28,2024 01:18 pm
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన 70కి పైగా తెలంగాణ వంటకాలను ప్రదర్శించారు.ఈ ఫుడ్ ఫెస్టివల్ లో ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులు చేసిన వంటలను రుచి చూశారు.విద్యార్థినులకు విద్యతో పాటు ఇటువంటి కల్చరల్ ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి ప్రిన్సిపల్ ను ఉపాధ్యాయులను ఆర్డీవో అభినందించారు.