హామీలు హంపట్ గ్యారెంటీలు గాయబ్
NEWS Nov 28,2024 07:23 am
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు హాంఫట్ అయ్యాయని, గ్యారెంటీలు గాయాబైనవని బీజేపీ నాయకులు ఆరోపించారు. మెట్ పల్లి పట్టణంలో బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై వారు ఛార్జిషీట్ విడుదల చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలలో ఒక మహాలక్ష్మి పథకం తప్ప మిగిలిన 5 పథకాలు అమలుకు నోచుకోలేదన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి అరాచక శక్తులు విజృంభిస్తున్నాయన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు.