వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు
NEWS Nov 28,2024 07:07 am
రానున్న వేసవి విద్యుత్ డిమాండ్ దిశగా జిల్లాలో పటిష్ట నెట్వర్క్ సిద్ధం చేస్తూ అన్ని పట్టణాలు, గ్రామాల్లో విరివిగా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేస్తున్నట్లు జగిత్యాల ఎస్ఈ శాలియా నాయక్ తెలిపారు. జగ్గాసాగర్ 33కెవి ఫీడర్ నుండి చౌలమద్ది సబ్ స్టేషన్ వరకు రూ. 25 లక్షలతో నిర్మించిన అంతర్గత లైన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించుటకు ఎన్పీడిసీల్ సీఎండీ వరుణ్ రెడ్డి జిల్లాలో 12 అంతర్గత, ప్రత్యామ్నాయ 33కెవి లైన్ల మంజూరు చేశారు.