ప్రధాని మోదీని కలిసిన BJP నేతలు
NEWS Nov 27,2024 01:09 pm
TG: రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. అందరినీ ఆయన ప్రేమతో ఆప్యాయంగా పలకరించారు. అందరూ బాగున్నారా అంటూ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో నేతలు కలసి మెలసి పని చేయాలని ఆయన సూచించారు. మోదీని కలిసిన వారిలో విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రాజా సింగ్, ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.