వృద్ధురాలైన తల్లిని కొడుకులు స్మశానంలో వదిలివేశారు.ఈ అమానవీయ ఘటన జగిత్యాలలో జరిగింది. జగిత్యాలకు చెందిన రాజవ్వను పెన్షన్ కోసం కుమారుడు చితకబాదాడు. విరిగిన కాలితో, అచేతన స్థితిలో ఆమెను స్మశానవాటికకు తరలించారు. 8 రోజులుగా వృద్ధురాలు అక్కడే ఉంది. స్థానికులు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించారు. చర్యలు తీసుకుంటామని అధికారి నరేశ్ తెలిపారు.