అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
NEWS Nov 26,2024 06:02 pm
కోమల్ల గ్రామానికి చారిత్రాత్మకత చరిత్ర ఉందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో రూ.52లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.