వరంగల్ మామునూరు విమానాశ్రయం పనులు త్వరగా పూర్తి చేసి విమాన రాకపోకలు ప్రారంభించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కోరారు. ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎంపి కావ్య కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పలు విషయాలపై చర్చించారు.