రెవిన్యూ సిబ్బందితో ఆర్డీఓ సమీక్షా
NEWS Nov 26,2024 02:06 pm
పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నందు ఆర్డీవో శ్రీ రమణి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో గల తహశీల్దార్లతో పిజిఆర్ఎస్, ఫ్రీహోల్డ్ రిపోర్టులు, ఎమ్మెల్సీ ఎన్నికలు, రీ -సర్వే గ్రామసభలు తదితర అంశాలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. పిజిఆర్ఎస్, రీ -సర్వే గ్రామసభల లో వచ్చిన అర్జీలను సమగ్రంగా విచారణజరిపి అర్జీదారులకు న్యాయంచేయలని ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.