ప్రభుత్వ సలహాదారున్ని మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసి అధ్యక్షుడు
NEWS Nov 26,2024 02:12 pm
నిర్మల్ జిల్లా: తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, నిర్మల్ పురపాలక సంఘం చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ మర్యాద పూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా నిర్మల్ మున్సిపాలిటీ -పట్టణ అభివృద్ధి కి నిధులు మంజూరు చేయుట గురించి వివరించారు. ప్రభుత్వ సలహాదారులు సానుకూలంగా స్పందించి, నిధులు మంజూరుకి కృషి చేస్తానని తెలిపారు.