అభివృద్ధి పనులకు MLA శంకుస్థాపన
NEWS Nov 26,2024 12:17 pm
మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 5 లక్షల రూపాయలతో నిర్మించబోయే ఓపెన్ జిమ్కి, వడ్డెర కాలనీలో 3 లక్షల రూపాయలతో నిర్మించబోయే నూతన డ్రైనేజీ నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు నిధుల నుంచి వాటిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.